శ్రీదేవి మరణ వార్తతో కంగనా రనౌత్ కు జ్వరం!

  • కంగనా రనౌత్ కు అస్వస్థత
  • రెండు రోజులుగా తీవ్ర జ్వరం
  • ‘మణికర్ణిక’ చిత్రం షూటింగ్ వాయిదా
ప్రముఖ నటి శ్రీదేవి మరణ వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవికి యువనటీనటుల్లోనూ అభిమానులున్నారు. శ్రీదేవి నటన చూసి తాను ఎంతో నేర్చుకున్నానని ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ పలు ఇంటర్వ్యూల్లో గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

ఇక శ్రీదేవి మరణవార్తతో కుంగిపోయిన కంగనా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. రెండు రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతోందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా టాలీవుడ్ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆమె జ్వరంతో బాధపడుతున్న కారణంగా ఈ చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడినట్టు చిత్రయూనిట్ సమాచారం.
Go Back to Shorts
Sridevi
kangana ranut

More Telugu News